: ఏడు పరుగులు చేసి వెనుదిరిగిన యువరాజ్ సింగ్

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఈ రోజు శ్రీ‌లంకతో త‌ల‌పడుతున్న టీమిండియా మూడో వికెట్‌ను కోల్పోయింది. ఏడు ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద‌ యువ‌రాజ్ రాజ్ సింగ్.. అసేలా బౌలింగ్‌లో అవుట‌య్యాడు. ప్ర‌స్తుతం క్రీజులో ధోనీ (8), శిఖ‌ర్ ధావ‌న్ (89) ఉన్నారు.  ప్ర‌స్తుతం టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 190 పరుగులతో( 36 ఓవర్లకి) క్రీజులో ఉంది. భారత బ్యాట్స్ మెన్ లో రోహిత్ శర్మ 78, కోహ్లీ 0, యువరాజ్ 7 పరుగులు చేశారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో మలింగ‌, ప్ర‌దీప్‌, అసేలాల‌కు చెరో వికెట్ ద‌క్కాయి.         

More Telugu News