: కేసీఆర్ కు భయపడి విజయవాడకు పారిపోయారు: పార్థసారధి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత పార్థసారధి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల పాలనలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసింది ఏమీ లేదని విమర్శించారు. మూడేళ్ల క్రితం ఆయన పెట్టింది ఐదు సంతకాలు కాదని... ఐదు వెన్నుపోట్లు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో ఎవరూ సంతోషంగా లేరని అన్నారు. 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని తెలిపారు. చంద్రబాబుకు నిజంగా దమ్ముంటే విశాఖ భూకబ్జా, అమరావతి భూముల కుంభకోణం, పోలవరం, పట్టిసీమ కుంభకోణాలు, ఉచిత ఇసుక, చెట్టు-నీరు కార్యక్రమాలపై సీబీఐ చేత విచారణ చేయించాలని సవాల్ విసిరారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు... కేసీఆర్ కు భయపడి విజయవాడకు పారిపోయారని అన్నారు.

More Telugu News