: దూకుడు తగ్గించని ఉత్తరకొరియా.. కొద్దిసేపటి క్రితం పలు క్షిపణుల పరీక్ష.. అమెరికా హెచ్చరికలు బేఖాతరు!

ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలను తోసిరాజని ఉత్తరకొరియా మరోమారు క్షిపణి పరీక్షలు నిర్వహించింది. గురువారం ‘సర్ఫేస్ టు షిప్’ క్షిపణులను పరీక్షించినట్టు దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.  నార్త్ కొరియా ఈ ఉదయం (గురువారం) పలు సర్ఫేస్ టు షిప్ మిసైళ్లను పరీక్షించిందని, వోన్సన్, గ్యాంగ్‌వోన్ ప్రావిన్స్ సమీపంలో ఈ పరీక్షలు జరిగాయని పేర్కొంది. ఐదు వారాల్లో ఉత్తరకొరియా నిర్వహించిన నాలుగో పరీక్ష ఇది. ఐక్యరాజ్యసమితి ఆంక్షలను, అమెరికా బెదిరింపులను బేఖాతరు చేస్తూ కిమ్ ప్రభుత్వం తాజా పరీక్షలు నిర్వహించింది. గతనెల మొదట్లో అమెరికా లక్ష్యంగా దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని నార్త్ కొరియా పరీక్షించి ఉద్రిక్తతలు పెంచింది. గతేడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కిమ్ ప్రభుత్వం రెండు అణుపరీక్షలు, డజన్ల కొద్దీ క్షిపణి పరీక్షలు నిర్వహించి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంది.

More Telugu News