: పళని ప్రభుత్వం మరో వారమైనా ఉంటుందా?: స్టాలిన్ సంచలన వ్యాఖ్య

పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే సర్కారు, మరో వారం రోజులైనా ఉంటుందా? అన్న అనుమానం తనకుందని డీఎంకే నేత ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, అప్పటివరకైనా పళని ప్రభుత్వం ఉండేలా కనిపించడం లేదని అన్నారు. కొంగునాడు మక్కల్ దేశీయ కచ్చి ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్‌ లో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఉంటే, తమ పని తాము చేసుకుపోతుంటామని చెప్పారు. ఇప్పటికే అన్నాడీఎంకే మూడు ముక్కలైందని, ఇంకా ఎన్ని ముక్కలుగా మారుతుందో ఊహించడం కష్టమని చెప్పిన ఆయన, డీఎంకే అధికారంలోకి వస్తే, సుపరిపాలనను ప్రజలకు చూపిస్తామని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో నీటిని నిల్వ ఉంచేలా ట్యాంకులు, చెరువులను నిర్మిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో అధికారం డీఎంకేదేనన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

More Telugu News