: గుంటూరులో రాహుల్ సభ ఓ ఫ్లాప్ షో: ఎమ్మెల్సీ సోము వీర్రాజు

గుంటూరులో ఇటీవల నిర్వహించిన రాహుల్ సభ ఓ ఫ్లాప్ షో అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా రాకపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ ఏపీకి తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ.1.75 లక్షల కోట్ల సాయం అందించిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా సోము వీర్రాజు ప్రస్తావించారు.

More Telugu News