: భూ కుంభకోణంలో సీఎం కార్యాలయం ప్రమేయం ఉంది: జీవన్ రెడ్డి

మియాపూర్ భూ కుంభకోణంలో  సీఎం కార్యాలయ ప్రమేయం, పెద్దల హస్తం వున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఒక్కడి వల్లే ఇదంతా సాధ్యం కాదని  అనుమానం వ్యక్తం చేశారు. ఈ స్కాంలో దోషులను తేల్చే శక్తి సీఐడీకి లేదని, సీబీఐ విచారణకు ఆదేశించి, సీఎం కేసీఆర్ తన సచ్ఛీలతను నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. గ్యాంగ్ స్టర్ నయీం కేసులో మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు పేరు ఎఫ్ఐఆర్ లో ఉన్నా ఆయనపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మియాపూర్ భూముల కేసును కూడా అలాగే చేస్తారేమోననే అనుమానాలను జీవన్ రెడ్డి వ్యక్తం చేశారు.

More Telugu News