: సెహ్వాగ్ రెజ్యూమ్ చూసి బిత్తరపోయిన బీసీసీఐ అధికారులు!

టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం మాజీ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరూ రెజ్యూమ్ చూసి, బీసీసీఐ అధికారులు అవాక్కయ్యారు. మనోడి రెజ్యూమ్ లో రెండు ముక్కలు తప్ప మరేమీ లేకపోవడమే దీనికి కారణం. "ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవెన్ జట్టుకు కోచ్ గా, మెంటార్ గా ఉన్నా. ఇంతకు ముందు ఈ కుర్రాళ్లందరితో కలసి ఆడా"... ఈ రెండు ముక్కలే రెజ్యూమ్ లో ఉన్నాయి.

ఈ దరఖాస్తును చూసిన బీసీసీఐ అధికారులు షాక్ కు గురయ్యారు. వెంటనే సెహ్వాగ్ ను సంప్రదించి... పూర్తి వివరాలతో కూడిన రెజ్యూమ్ ను పంపించాలంటూ కోరారు. ఇంకా చెప్పాలంటే బతిమాలుకున్నారట. దరఖాస్తుతో పాటు, రెజ్యూమ్ ను కూడా పంపాలని సెహ్వాగ్ ను అడిగామని... ఈ పదవి కోసం ఆయన తొలిసారి హాజరవుతున్నారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

More Telugu News