: చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే మా ఇంటికి కరెంట్ వచ్చింది!: సివిల్స్ ర్యాంకర్ గోపాలకృష్ణ

ఏపీలో పని చేయాలని ఉందని, సీఎం చంద్రబాబు సలహాలు, సూచనలు పాటిస్తానని సివిల్స్ లో ర్యాంక్ సాధించిన రోణంకి గోపాలకృష్ణ అన్నారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2016 ఫలితాల్లో మూడో ర్యాంకు సాధించిన గోపాలకృష్ణ ను చంద్రబాబు సన్మానించి, అభినందనలు తెలిపారు. అనంతరం, గోపాలకృష్ణ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన వల్లే తమ ఇంటికి కరెంట్ వచ్చిందని అన్నారు. అలాగే, కరెంట్ కోసం డిపాజిట్ ను రూ.3 వేల నుంచి రూ.400 కు తగ్గించిన విషయాన్ని ఈ సందర్భంగా గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. కాగా, గోపాలకృష్ణ  స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని పారసంబ.

More Telugu News