: ఇస్రో శాస్త్రవేత్తలకు కేసీఆర్, కేటీఆర్ అభినందనలు
జీఎస్ఎల్వీ మార్క్-3 డీ1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విజయంతో దేశం గర్వపడుతోందని, అరుదైన మైలురాయిని ఇస్రో అందుకుందని కేసీఆర్ ప్రశంసించారు. కాగా, తెలంగాణ మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులను గర్వపడేలా చేసిన ఇస్రోకు కంగ్రాట్స్ అని పేర్కొన్నారు.