: పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టింది: భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధికార పార్టీ నేతలు చెప్పిందే పోలీసులు చేస్తున్నారని, పోలీస్ వ్యవస్థ రాజకీయ రంగు పులుముకుందని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు తప్పదని, ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. ‘మిషన్ భగీరథ’ ద్వారా  డబ్బులు తప్పా నీళ్లు పారడం లేదని ఆరోపించారు.

More Telugu News