: దేశం గ‌ర్విస్తోంది: ఇస్రో సూపర్ సక్సెస్ ను కొనియాడిన ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీ, మోదీ

జీఎస్‌ఎల్వీ మార్క్-3 డీ1 రాకెట్ ద్వారా ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు జీశాట్-19 ఉపగ్రహాన్ని విజ‌య‌వంతంగా కక్ష్యలో ప్రవేశ‌పెట్ట‌డం ప‌ట్ల రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు అభినంద‌న‌లు తెలుపుతున్న‌ట్లు ప్ర‌బ‌ణ్ ముఖర్జీ చెప్పారు. ఈ గొప్ప విజ‌యం దేశాన్ని గ‌ర్వ‌ప‌డేలా ‌చేస్తోంద‌ని అన్నారు. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న శాస్త్ర‌వేత్త‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. అధునాత‌న సాంకేతిక, స‌మాచార‌ వ్య‌వ‌స్థ అందుబాటులోకి రానుంద‌ని చెప్పారు.  
 



More Telugu News