: ఛాంపియన్స్ ట్రోఫీ: పాక్ గెలుస్తుందని జోస్యం చెప్పిన ఒంటె!

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ జట్లు ఈ రోజు తలపడుతున్న విషయం తెలిసిందే. పాక్ పై భారత్ విజయం సాధించాలని కశ్మీర్ లో సైనికులు డ్యాన్స్ లు చేస్తున్న వీడియో వైరల్ అవడం విదితమే. తాజాగా, ఈ మ్యాచ్ లో పాక్ గెలుస్తుందని ఒంటె జోస్యం చెబుతోంది. ఇంతకీ, ఆ ఒంటెతో ఈ జోస్యం ఎవరు చెప్పించారంటే, పాకిస్థాన్ కు చెందిన ఓ జర్నలిస్టు.

ఇస్లామాబాద్ లోని ఓ రోడ్డుపై ఏర్పాటు చేసిన టేబుల్ పై ‘ఇండియా’, ‘పాకిస్థాన్’ అని రాసి ఉన్న రెండు కార్డు బోర్డులను ఉంచారు. ఆ టేబుల్ దగ్గరకు ఒంటెను దాని యజమాని తీసుకురాగా, అప్పటికే తన చేతిలో మైక్ తో జర్నలిస్టు సిద్ధంగా ఉన్నాడు. ఆ టేబుల్ దగ్గరకు వచ్చిన ఒంటె ‘పాకిస్థాన్’ పేరు రాసి ఉన్న కార్డు బోర్డును పట్టుకుంది. దీంతో, ఈ మ్యాచ్ లో పాక్ గెలుపు ఖాయమంటూ సదరు జర్నలిస్టు సహా అక్కడ ఉన్నవారు గెంతులేశారు. ఇదంతా అక్కడి స్థానికులు వీడియో తీయడం, సామాజిక మాధ్యమాలకు చేరడంతో వైరల్ గా మారింది. 

More Telugu News