: ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఇంకా కళ్లు తెరవడం లేదు: కేవీపీ

ఏపీకి ప్రత్యేక హోదాపై జాతీయ నాయకులు మద్దతు ఇస్తున్నా, చంద్రబాబునాయుడు మాత్రం ఇంకా కళ్లు తెరవడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. విభజన చట్టంలో హామీలను సాధించుకునే దమ్ము లేకనే, కాంగ్రెస్ పార్టీపై చంద్రబాబు నిందలు వేస్తున్నారని ఆరోపించారు. నాడు రెండు కళ్ల సిద్ధాంతం, నేడు కుమ్మక్కు రాజకీయాలతో ఆంధ్రా ప్రజలను చంద్రబాబు నిలువునా మోసం చేస్తున్నారని ఆరోపించారు.

More Telugu News