: కూక‌ట్ ప‌ల్లిలో బ్యాడ్మింట‌న్ ఆడిన మంత్రి కేటీఆర్

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు హైద‌రాబాద్‌లోని కూక‌ట్ ప‌ల్లిలో స‌ర‌దాగా బ్యాడ్మింట‌న్ ఆడారు. కూక‌ట్ ప‌ల్లిలోని ఫేజ్ 3లో నిర్మించిన మిని ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన ఆయ‌న... అనంత‌రం స‌ర‌దాగా క్రీడాకారుల‌తో ఈ ఆట ఆడి వారిని ఉత్సాహ‌ప‌రిచారు. కేటీఆర్‌తో పాటు ప‌లువురు టీఆర్ఎస్ నాయ‌కులు కూడా బ్యాడ్మింట‌న్ ఆడారు. అంత‌కు ముందు కేటీఆర్ బాలాన‌గ‌ర్‌లో డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.  




More Telugu News