: ఉద్యమం సమయంలో బాల్క సుమన్ ఇద్దరు విద్యార్థులను బలి తీసుకున్నాడు!: జగ్గారెడ్డి తీవ్ర ఆరోపణలు

తన గురించి మాట్లాడిన టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాల్క సుమన్ ఓ బచ్చా అని అన్నారు. తనను ముట్టుకుని గుండు కొట్టించేంత దమ్ము బాల్క సుమన్ కు ఉందా? అని ప్రశ్నించారు. అతనిపై ఇప్పటికే ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయడానికి... ఇద్దరు విద్యార్థులను సుమన్ బలి తీసుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హత్య కేసుల సంగతి తేలుస్తామని చెప్పారు. ఉస్మానియా యూనివర్శిటీలో కేసీఆర్ తో సభ పెట్టించేంత దమ్ము సుమన్ కు ఉందా? అని ఎద్దేవా చేశారు. తాను తలచుకుంటే బాల్క సుమన్ ను హైదరాబాదులో తిరగకుండా చేయగలనని అన్నారు. 

More Telugu News