: వెస్టిండీస్ క్రికెట్ టీమ్ పేరు మారింది!

వెస్టిండీస్ క్రికెట్ టీమ్ పేరు మారిపోయింది. ఇన్నాళ్లు మనం పొట్టిగా పిలుచుకున్న 'విండీస్' అనే పదమే అధికారిక పేరుగా మారింది. అలాగే బోర్డు పేరును కూడా వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ అని కాకుండా.. 'క్రికెట్ విండీస్' అని పిలవనున్నారు. తమ 91వ వార్షికోత్సవం సందర్భంగా ఈ మార్పులు జరిగాయని బోర్డు సీఈవో జానీ గ్రేవ్స్ తెలిపారు. సరికొత్త పేర్లతో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తామని చెప్పారు. ప్రస్తుతం విండీస్ జట్టు సమస్యలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. రెమ్యునరేషన్ విషయంలో స్టార్ ఆటగాళ్లకు, బోర్డుకు గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఈ జట్టు అర్హత సాధించలేకపోయింది. 

More Telugu News