: నా రాజకీయ జీవితంలో ఇంత పెద్ద కుంభకోణాన్ని ఎప్పుడూ చూడలేదు: బొత్స సత్యనారాయణ

తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇంతపెద్ద కుంభకోణాన్ని ఎప్పుడూ చూడలేదని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, భూకుంభకోణాలతో విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో భారీ కుంభకోణానికి తెరతీశారని ఆయన ఆరోపించారు. 3 లక్షల అడంగల్ కాపీలు కనిపించడం లేదని ఆయన చెప్పారు. అడ్డగోలుగా భూములు ఆక్రమించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. 

More Telugu News