: రెండు వారాల కిందట వైసీపీలో చేరారు.. మళ్లీ సొంత గూటికి చేరారు!

సరిగ్గా రెండు వారాల కింద టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు. కానీ, ఇంతలోనే మళ్లీ టీడీపీలోకి వచ్చారు. ఈ ఆసక్తికర ఘటన వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీలోని 12వ వార్డు కౌన్సిలర్ అయిన జమృత్ భీ రెండు వారాల కింద టీడీపీకి గుడ్ బై చెప్పి, వైసీపీలో చేరారు. నిన్న మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. నిన్న సాయంత్రం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సమక్షంలో ఆమె మళ్లీ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు, ఆమె కుమారుడు అల్తాఫ్ లకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అశోక్ రెడ్డి.

More Telugu News