: కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిస్తాం: రేవంత్ రెడ్డి

ఎన్నో త్యాగాలు, పోరాటాల వల్ల తెలంగాణను సాధించుకున్నామని... అలాంటి తెలంగాణ ప్రస్తుతం ఒక వ్యక్తి చేతిలో బందీ అయిందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలందరికీ దక్కాల్సిన రాష్ట్ర సంపద... కేవలం ఒక కుటుంబానికి మాత్రమే దక్కుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిస్తామని... రేపటి నుంచి కార్యాచరణ చేపడతామని చెప్పారు. ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్.రమణ, రావుల, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

More Telugu News