: ప్రాక్టీస్ అయిపోగానే అభిమానుల వద్దకు వెళ్లి.. వారిని ఖుషీ చేసిన టీమిండియా ఆటగాళ్లు

ఇంగ్లండ్‌లో కొన‌సాగుతున్న ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఎల్లుండి పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌తో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది. ఇందుకోసం టీమిండియా క‌స‌ర‌త్తులు చేస్తోంది. నిన్న బర్మింగ్‌హామ్ లో ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్న టీమిండియాను చూసేందుకు అభిమానులు అక్కడికి భారీగా చేరుకున్నారు. సాధార‌ణంగా అభిమానుల‌కు అభివాదం చేసి వెళ్లిపోయే క్రికెట‌ర్లు ఈ సారి మాత్రం భిన్నంగా వ్య‌వ‌హ‌రించి, అభిమానుల‌ను ఖుషీ చేశారు.

క్రికెట‌ర్లు కోహ్లీ, ధోనీ, రోహిత్‌ శర్మ, కోచ్‌ కుంబ్లే అభిమానుల వ‌ద్ద‌కు వెళ్లి వారితో సెల్ఫీలు దిగి, వారికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. మైదానంలో ఆట‌గాళ్లు ప్రాక్టీస్ చేస్తుండ‌గా అభిమానులంతా కోహ్లీ.. ధోనీ.. అంటూ నినాదాలు చేయ‌డంతో వారిని సంతోష పెట్టేందుకు ప్రాక్టీస్ అయిపోయాక వీరంతా క‌లిసి ఇలా చేశారు. స్థానికులు టీమిండియాకు మద్దతు తెల‌ప‌డం ప‌ట్ల కోహ్లీ హ‌ర్షం వ్య‌క్తం చేశాడు.        

More Telugu News