: క్యూ లైన్లోని భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్.. ఉచిత ఫోన్ సౌకర్యం

తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లో గంటల తరబడి వేచి ఉండే భక్తులు... తమవారి యోగక్షేమాల గురించి టెన్షన్ పడుతుంటారు. వారితో మాట్లాడటానికి వీరికి ఎలాంటి అవకాశం ఉండదు. మొబైల్ ఫోన్లను బయటే మొబైల్ లాకర్స్ లో పెట్టి దర్శనానికి వెళుతుండటమే దీనికి కారణం.

 ఈ ఇబ్బందిని గమనించిన టీటీడీ కొత్త ఈవో అనిల్ కుమార్ సింఘాల్ భక్తులకు ఉచిత ఫోన్ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంలో భాగంగా నిన్న ఓ క్యూ కాంప్లెక్స్ లో ఓ ఫోన్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. మొదట కాయిన్ బాక్స్ లను ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ... చివరకు ఉచితంగా సేవలను అందించాలని ఆయన నిర్ణయించారు. అయితే, ఈ ఫోన్ కాల్ రెండు నిమిషాల సేపు మాత్రమే ఉంటుంది... రెండు నిమిషాల తర్వాత ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది.

More Telugu News