: ఛాంపియన్స్ ట్రోఫీ: ఇంగ్లండ్ లక్ష్యం 306 పరుగులు!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2017లో భాగంగా ఈ రోజు లండ‌న్‌లోని ఓవ‌ల్ లో జ‌రుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ పై బంగ్లాదేశ్ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు న‌మోదు చేసుకుంది. ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్ 128 ప‌రుగులు, ముష్ఫికర్‌ రహీమ్ 79 ప‌రుగులతో రాణించ‌డంతో ఆ జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌కి 6 వికెట్ల న‌ష్టానికి 305 ప‌రుగులు చేసింది. ఇంకా సౌమ్య 29, ఇమ్రుల్ 19, షాకిబ్ 10, ష‌బ్బిర్ 24, రియాద్ 6, మోస‌ద్దెక్ 2 ప‌రుగులు చేశారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో ప్లంకెట్ 59 ప‌రుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇక జేక్ బాల్ 82 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీయ‌గా, మ‌రో బౌల‌ర్ స్టోక్స్ 42 ప‌రుగులు ఇచ్చుకుని ఒక వికెట్ తీశాడు.                   

More Telugu News