: పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై బీఎస్ఎన్ఎల్ అదనపు డేటా ఆఫర్.. నేటి నుంచే అమలు!

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) నేటి నుంచి పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై అదనపు డేటాను ఆఫర్ చేస్తోంది. రూ.1125 ప్లాన్‌లో ఇది వరకు 10 జీబీ డేటా ఇస్తుండగా నేటి నుంచి అది 20 జీబీ కానుంది. రూ.1525 ప్లాన్‌లో నేటి నుంచి 30 జీబీ డేటా వినియోగదారులకు అందనుంది. గతంలో అంతే మొత్తంలో అంతే డేటా ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా లభించేది. ఈ రెండు ప్లాన్లలోనూ అపరిమితంగా లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 250 ఎస్ఎంఎస్‌లు ఉచితం. టెలికం రంగంలో పోటీకి తెరలేవడంతో బీఎస్ఎన్ఎల్ కూడా తరచూ ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది.

More Telugu News