: టర్కీలో కూలిన మిలటరీ హెలికాప్టర్.. 13 మంది సైనికుల మృతి

సైనికులతో వెళ్తున్న మిలటరీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిపోయిన ఘటనలో 13 మంది సైనికులు మృతి చెందారు. టర్కీలోని ఆగ్నేయ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని సిర్నాక్ ప్రావిన్స్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే హై-ఓల్టేజ్ విద్యుత్ వైర్లు తాకడంతో హెలికాప్టర్ కూలిపోయింది. అందులో ఉన్న 13 మందీ అమరులైనట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు టర్కీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ హులుసి అకర్ తెలిపారు.

More Telugu News