: జర్మనీలో ప్రధాని మోదీ ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న ప్రియాంక చోప్రా.. నెటిజన్ల విమర్శలు
జర్మనీ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అక్కడే ఉన్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ రోజు కలిసిన విషయం తెలిసిందే. బెర్లిన్లో ఆమె కాసేపు మోదీతో ముచ్చటించారు. అయితే, ఆమె మోదీతో మాట్లాడుతుండగా కూర్చున్న విధానం, ఆమె వేసుకున్న దుస్తులపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ప్రధాని మోదీ సాధారణంగా కూర్చుంటే ప్రియాంక చోప్రా మాత్రం మోదీ ముందే కాలుమీద కాలేసుకుని కూర్చుంది. అంతేగాక, భారత ప్రధానిని చూడడానికి వచ్చిన ఆమె వేసుకొచ్చిన డ్రెస్సుపై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రియాంక చోప్రా అభిమానులు మాత్రం ఆమె ఆత్మవిశ్వాసంతో కూర్చుని మాట్లాడుతోందని అంటున్నారు.