: అయోధ్య‌లోని బాబ్రీ మసీదును కూల్చడం గర్వంగా భావిస్తున్నాం: సాక్షి మహారాజ్‌

అయోధ్య‌లోని బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టులో బీజేపీ సీనియర్ నేతలు హాజరైన నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ సాక్షి మహారాజ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఈ రోజు ఆయ‌న కూడా కోర్టులో వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. ఆ మసీదును కూల్చివేయడం తమకు గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఇక‌ అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ఎవ్వ‌రూ అడ్డుకోలేరని ఆయ‌న అన్నారు. బాబ్రీ మసీదు అని చెప్పే ప్రాంతంలో ముందునుంచి మసీదు లేద‌ని, ఆ ప్రదేశం రామ జన్మభూమి మాత్ర‌మేన‌ని ఆయ‌న అన్నారు. విదేశీయుడైన బాబర్‌ పేరుతో అక్క‌డ‌ ఏదో కడితే, దాన్నే ‘బాబ్రీ మసీదు’ అని సంబోధిస్తున్నార‌ని తెలిపారు.

More Telugu News