: మేం అధికారంలోకి వచ్చాక 'టీఎస్'ను 'టీజీ'గా మారుస్తాం: రేవంత్ రెడ్డి

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం తీవ్ర రూపంలో సాగుతున్న వేళ, తెలంగాణ పేరు పొడి అక్షరాల్లో 'టీజీ'గా పాప్యులర్ అయిన విషయాన్ని ప్రస్తావించిన తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి... టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక, వారి పార్టీ పేరు కనిపించేలా 'టీఎస్'గా పెట్టిందని ఆరోపించారు. తదుపరి ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, ఆ వెంటనే 'టీఎస్' స్థానంలో 'టీజీ' అని మారుస్తామని తెలిపారు. రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల పేరిట స్మారక స్థూపం నిర్మిస్తానని ఇచ్చిన హామీని కూడా కేసీఆర్ మరచిపోయారని విమర్శించారు. హుస్సేన్ సాగర్ లోని బుద్ధ విగ్రహం పక్కనే ప్రాణాలర్పించిన అమరవీరుల పేర్లతో కూడిన చిహ్నాన్ని తమ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏర్పాటు చేస్తామని తెలిపారు.

More Telugu News