: బాగ్దాద్ లో ఉగ్రదాడి... ఎనిమిది మంది మృతి, 22 మందికి గాయాలు

ప్రపంచంలోని ఏదో ఒక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పంజా విసురుతున్నారు. తాజాగా ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ లోని కరాడా సెంట్రల్‌ లోని రద్దీగా ఉన్న ఐస్‌ క్రీం పార్లర్‌ పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 22 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. అమాయక పౌరులే లక్ష్యంగా ఈ ఉగ్రదాడి చోటుచేసుకుంది. అందుకే ఐస్ క్రీం పార్లర్ ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. దీంతో అప్పటివరకు ఆహ్లాదంగా, ఆనందంగా ఉన్న ఆ పార్లర్ ఒక్కసారిగా హాహాకారాలు, ఆర్తనాదాలు, రోదనలతో నిండిపోయింది. హతులు, క్షతగాత్రులతో ఆ పార్లర్ రక్తసిక్తమైంది. హుటాహుటీన చేరుకున్న భద్రతాదళాలు క్షతగాత్రులను స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి ఐఎస్ఐఎస్ పనే అని భావిస్తున్నారు.

More Telugu News