: పఠాన్ కోట్ లో హై అలర్ట్... ఆర్మీ, స్వాత్ కమెండోల తనిఖీలు

పంజాబ్ లోని పఠాన్ కోట్ లో మళ్లీ ఉగ్ర కలకలం రేగింది. నిన్న రాత్రి జరిగిన పోలీసుల తనిఖీల్లో ఓ బ్యాగు వారికి దొరికింది. ఇందులో మూడు సైనిక దుస్తులను కనుగొన్నారు. దీంతో, ఒక్కసారిగా అలజడి చెలరేగింది. అప్రమత్తమైన భద్రతాదళాలు హైఅలర్ట్ ప్రకటించాయి. ఆర్మీ, స్వాత్ కమెండోల ఆధ్వర్యంలో భారీ ఎత్తున తనిఖీలను నిర్వహిస్తున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని సైనికాధికారులు తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. గత ఏడాది పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో 37 మంది పౌరులు గాయాలపాలయ్యారు.

More Telugu News