: పోలీసులు రావద్దంటున్నా షహరాన్ పూర్ బయల్దేరిన రాహుల్!

ఉత్తరప్రదేశ్ షహరాన్ పూర్ జిల్లాలో దళితులు, రాజ్ పుత్ ఠాకూర్ల మధ్య తలెత్తిన హింసాత్మక ఘర్షణలతో ఆ ప్రాంతం అట్టుడుకుతోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. రాజకీయ నాయకులు ఎవరూ ఈ ప్రాంతాన్ని సందర్శించవద్దని, ఎవరి పర్యటనలకు అనుమతి లేదని యూపీ అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) ఆదిత్య మిశ్రా నిన్న స్పష్టం చేశారు.

 అయితే, పోలీసు అధికారులు రావద్దంటున్నా ఆ ప్రాంతంలో పర్యటించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి బయల్దేరారు. హింస చెలరేగిన ప్రాంతంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి, బాధితులతో మాట్లాడాలని రాహుల్ భావిస్తున్నారు. మరి రాహుల్ పర్యటనపై యోగి సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. 

More Telugu News