: మూడు లేదా నాలుగు రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు!

మూడు లేదా నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 30 లేదా 31కి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని చెప్పారు. అనుకూల వాతావరణం నెలకొన్న కారణంగా 30 వ తేదీ కన్నా ఒక రోజు ముందుగానే రుతుపవనాలు ప్రవేశిస్తాయని మొదట్లో వాతావరణ శాఖ అధికారులు భావించారు. కానీ, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అనుసరించి ముందుగానే ప్రకటించిన తేదీల్లోనే కేరళ, మాల్దీవులు, దక్షిణ అరేబియా సముద్రం పరిసరాలను రుతుపవనాలు తాకుతాయని పేర్కొన్నారు. 

More Telugu News