: మొహాలీలో న్యాయవాదిని కాల్చి చంపిన దుండగులు

పంజాబ్ లోని మొహాలీలో ఓ న్యాయవాదిని గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. మొహాలీలోని ఎస్ఏఎస్ నగర్ కు చెందిన హరికిషన్ సింగ్ విధుల నిమిత్తం ఈ రోజు ఉదయం పది గంటల ప్రాంతంలో తన ద్విచక్రవాహనంపై జిల్లా కోర్టుకు వెళుతున్నారు. అదే సమయంలో, కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన వైపు ఓ ఇనుపరాడ్డును విసిరారు. అది గురితప్పడంతో వారి నుంచి తప్పించుకునేందుకు యత్నించగా, దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో హరికిషన్ సింగ్ ప్రాణాలు విడిచారు. తన బంధువుల నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్టు కొద్ది రోజుల కిందట హరికిషన్ తమకు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News