: బీజేపీ కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిగా యడ్యూరప్ప: అమిత్ షా ప్రకటన

ద‌క్షిణాదిన బ‌లం పుంజుకోవాల‌ని చూస్తోన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌మ త‌దుప‌రి టార్గెట్‌గా క‌ర్ణాట‌కని పెట్టుకున్న విష‌యం తెలిసిందే. వ‌చ్చే సంవ‌త్సరం ఆరంభంలో ఆ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో క‌ర్ణాట‌క‌ మాజీ ముఖ్య‌మంత్రి బీఎస్ య‌డ్యూర‌ప్ప‌ను త‌మ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు ఈ రోజు బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా తెలిపారు. ఓ జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ క‌ర్ణాట‌క‌లో యడ్యూర‌ప్ప త‌మ పార్టీకి బ‌లం చేకూరుస్తున్నార‌ని ప్ర‌శంసించారు.                  
 

More Telugu News