: ఈజిప్టులో క్రైస్తవులపై గుర్తు తెలియని దుండగుల కాల్పులు... 23 మంది మృతి

ఈజిప్టులో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్య‌క్తులు క్రైస్త‌వుల‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. దీంతో 23 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 25 మందికి తీవ్రగాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకి త‌ర‌లించి, చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా ఓ బస్సులో వెళుతుండ‌గా ఈ కాల్పుల ఘ‌ట‌న చోటుచేసుకుంద‌ని అక్క‌డి అధికారులు తెలిపారు. వారంతా దక్షిణ ఈజిప్టులోని మిన్యా గవర్నరేట్‌ అన్బా శామ్యూల్‌ మొనాస్టరీకి వెళుతున్నార‌ని చెప్పారు. పరారీలో ఉన్న దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈజిప్టులో ఇటీవ‌ల కోప్టిక్‌ క్రైస్తవులపై తీవ్రవాదుల దాడులు ఎక్కువ‌య్యాయి.
                           

More Telugu News