: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ ను పట్టుకున్నారు. చిన్నపిల్లల బ్యాగ్ లలో పెట్టి ఎపిడ్రిన్ అనే మత్తు పదార్థాన్ని తరలిస్తుండగా నార్కోటిక్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ.12 కోట్ల ఉంటుంది. ‘ఎపిడ్రిన్’ను స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్టు చేశారు. సింగపూర్, హాంకాంగ్, శ్రీలంకకు డ్రగ్స్ తరలిస్తున్నట్టు నార్కోటిక్ కంట్రోలు బ్యూరో అధికారులు గుర్తించారు.

More Telugu News