: వన్డే చరిత్రలో అద్భుత రికార్డు సాధించిన పాక్ క్రికెటర్

పీసీబీ ఫజల్ మహమూద్ ఇంటర్‌ క్లబ్‌ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్ లో భాగంగా జరుగుతున్న 50 ఓవ‌ర్ల మ్యాచ్ లో పాకిస్థాన్ క్రికెట‌ర్‌ బిలాల్ ఇర్షాద్ (26) అజేయ ట్రిపుల్ సెంచరీ సాధించి స‌రికొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 175 బంతులు ఎదుర్కున్న బిలాద్ మొత్తం 320 పరుగులు చేశాడు. దీంతో ఆ క్రికెట‌ర్ ఆడుతున్న జ‌ట్టు నిర్ణీత 50 ఓవర్లలో మొత్తం 556 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ప‌స్ర‌త్య  అల్ రెహ్మాన్ సీసీ ఏ మాత్రం రాణించ‌లేక పోవ‌డంతో స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. దీంతో 411 పరుగుల భారీ తేడాతో షాహీద్‌ అలామ్‌ బక్స్‌ విజయం సాధించింది. ఓపెనర్‌గా మైదానంలోకి అడుగుపెట్టిన క్రికెట‌ర్ బిలాద్ ఆట మొత్తం ముగిసేవ‌ర‌కు క్రీజులోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న మొత్త‌ 9 సిక్స్‌లు, 42 ఫోర్లు బాదాడు.                      

More Telugu News