: బీజేపీతో కలిసి ఉన్న టీడీపీతో పొత్తు ఎలా సాధ్యం?: కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి

తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధమంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో జైపాల్ వ్యాఖ్యలతో కొందరు కాంగ్రెస్ నేతలు విభేదిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు పొత్తులు ఎందుకని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. పొత్తులనేవి పార్టీ విధాన నిర్ణయం ప్రకారం ఉంటాయని చెప్పారు. టీడీపీతో పొత్తు ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. బీజేపీతో టీడీపీ కలసి ఉందని... అలాంటి పార్టీతో పొత్తు ఎలా కుదురుతుందని అన్నారు. పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో... ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీని బలహీనం చేయవద్దని సూచించారు. 

More Telugu News