: నిద్రపోవట్లేదు బిడ్డా... మీ అమ్మ చనిపోయింది!: తల్లి శవం పక్కన ఏడాది చిన్నారి

ఆ తల్లిని ఎవరైనా హత్య చేశారో... లేక జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడిందో కానీ... నిండా ఏడాది వయసు కూడా లేని ఆమె బిడ్డ అనాధగా మిగిలాడు. కనీసం అమ్మా అని పలకడం కూడా రాని స్థితిలో అమ్మపాల కోసం తల్లి మృతదేహం పక్కనే కూర్చుని, ఆమెను లేపేందుకు ప్రయత్నిస్తూ, పాలు తాగే యత్నం చేస్తుంటే, చూసే వాళ్ల హృదయం ద్రవించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, దమోహ్ ప్రాంతంలో ఓ రైల్వే ట్రాక్ పక్కన మహిళ మృతదేహం, పక్కనే ఓ చిన్నారి ఏడుస్తూ స్థానికులకు కనిపించారు. తల్లి ఈ లోకంలో లేదని తెలియని స్థితిలో ఉన్న చిన్నారి పడుతున్న అవస్థను కొందరు వీడియో తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఈమె ఎవరన్న విషయాన్ని విచారిస్తున్నామని, చిన్నారిని శిశు సంరక్షణా కేంద్రంలో ఉంచామని తెలిపారు.

More Telugu News