: నమ్మలేని నిజం... ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరికి థైరాయిడ్!

థైరాయిడ్ మహమ్మారి భారతీయులను కబళిస్తోంది. మన దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ వివరాలను ఎస్ఆర్ఎల్ డయాగ్నోస్టిక్స్ అనే సంస్థ వెల్లడించింది. 2014-16 మధ్య కాలంతో దేశవ్యాప్తంగా ఈ సంస్థ 33 లక్షల మందిపై సర్వే నిర్వహించింది. బరువు పెరగడంతో పాటు, హార్మోన్ల అసమతౌల్యం వల్ల ఈ సమస్య ఎదురవుతున్నట్టు సర్వేలో పాల్గొన్న డాక్టర్లు తెలిపారు. థైరాయిడ్ బాధితుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. హైపో థైరాయిడిజం ఉత్తర భారతంలో ఎక్కువగా ఉందని.. మధ్యస్తమైన సబ్ క్లినికల్ థైరాయిడిజం తూర్పు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని తెలిపారు.

థైరాయిడ్ లోపంతో బాధపడేవారు శారీరక బలహీనతకు లోనవుతారని... బరువు పెరగడం, డెప్రెషన్, అలసట, కొలెస్టరాల్ పెరగడం వంటి సమస్యలతో బాధపడతారని డాక్టర్లు చెప్పారు. సబ్ క్లినికల్ థైరాయిడిజం చాపకింద నీరులా సైలెంట్ గా మన దేశంలో వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పురుషుల కంటే మహిళలు 8 రెట్లు అధికంగా థైరాయిడ్ బారిన పడే అవకాశం ఉందని చెప్పారు. ముందుగానే ఈ సమస్యను గుర్తించడం, సరైన చికిత్స తీసుకోవడం ద్వారా థైరాయిడ్ లోపాన్ని అధిగమించవచ్చని సూచించారు.

More Telugu News