: గొట్టిపాటిని లోపలకు రానీయకుండా అడ్డుకున్న కరణం వర్గీయులు... ఒంగోలు టీడీపీ సమావేశంలో ఇరు వర్గాల బాహాబాహీ!

ప్రకాశం జిల్లా ఒంగోలు తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. ఒంగోలులోని టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, శిద్దా రాఘవరావు, పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సమావేశానికి కరణం బలరాం వర్గీయులు ముందుగా చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే గొట్టిపాటి రవి అక్కడికి చేరుకోగా, కరణం బలరాం వర్గీయులు ద్వారం వద్ద ఎమ్మెల్యేని అడ్డుకున్నారు. వేమవరం హత్యలపై ఆరోపణలు చేస్తూ గొట్టిపాటి రవిపై దాడికి దిగే ప్రయత్నం చేశారు.

ఈ నేపథ్యంలో రవి వర్గీయులు వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో కరణం వర్గీయులు, గొట్టిపాటి వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. మంత్రులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా కరణం వర్గీయులు శాంతించలేదు, గొట్టిపాటి రవిని సమావేశం నుంచి పంపేయాలంటూ మంత్రులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు గొట్టిపాటి రవిని అక్కడి నుంచి పంపేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

More Telugu News