: చిన్న చిన్న విషయాలకు అలగడం ఏంటి?: కిషన్ రెడ్డికి క్లాస్ పీకిన అమిత్ షా!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా, వేదికపైకి పిలుస్తున్నా రాకుండా అలకబూనిన బీజేపీ శాసనసభా పక్ష నేత జి.కిషన్ రెడ్డిని ఆయన మందలించినట్టు తెలుస్తోంది. చిన్న చిన్న విషయాలకు అలగాల్సిన అవసరం ఏంటని కిషన్ రెడ్డిని అమిత్ షా ప్రశ్నించారని పార్టీ వర్గాలు తెలిపాయి. నల్గొండలో తానున్న గెస్ట్ హౌస్ కు కిషన్ రెడ్డిని పిలిపించుకున్న అమిత్ షా, ఎవరికి తోచినట్టు వారు పనిచేయడం కాదని, పార్టీ కోసం అందరూ కలసికట్టుగా పనిచేయాలని క్లాస్ తీసుకున్నట్టు సమాచారం.

కాగా, నల్గొండలో రెండో రోజు పర్యటనలో ఉన్న ఆయన, ఈ ఉదయం వెలుగుపల్లిలో పండిట్ దీన్ దయాల్ విగ్రహాన్ని ఆవిష్కరించి, అక్కడి దళితవాడకు ఆయన పేరు పెట్టారు. ఆపై చిన్న మాదారం గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని కూడా అమిత్ షా ఆవిష్కరించారు. కేంద్రం అందిస్తున్న పథకాలు ప్రజలకు ఏ మేరకు అందుతున్నాయన్న విషయమై గ్రామస్తులతో చర్చించారు.

More Telugu News