: బరితెగించిన కశ్మీర్ వేర్పాటువాదులు... క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పాక్ జాతీయగీతం ఆలాపన!

జమ్ముకశ్మీర్ లోని వేర్పాటువాదులు మరోసారి బరి తెగించారు. పుల్వామా జిల్లాలో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పాక్ జాతీయగీతాన్ని ఆలపించారు. పుల్వామా హంటర్స్, పాంపోరా ఎలెవెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే భారత వ్యతిరేక నినాదాలు చేసిన వారిని కాని, మ్యాచ్ నిర్వాహకులను కాని ఇంతవరకు పోలీసులు అరెస్టు చేయలేదు. హిజ్బుల్ మిలిటెంట్ బుర్హాన్ వనీని ఎన్ కౌంటర్ చేసినప్పటి నుంచి జమ్ముకశ్మీర్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. 

More Telugu News