: చంద్రబాబు తప్ప మరెవరు వచ్చినా ఏపీకి అన్యాయం జరుగుతుంది: జేసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో కొనసాగాలంటే చంద్రబాబే మళ్లీ గెలవాలని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు స్థానంలోకి మరే నాయకుడు వచ్చినా రాష్ట్రానికి న్యాయం చేయలేడని చెప్పారు. హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి, రాయలసీమకు ఎక్కువ నీటిని తీసుకువచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పోతిరెడ్డిపాడు వల్ల రాయలసీమకు నీరు వస్తోందని చెప్పారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ జేసీ పైవ్యాఖ్యలు చేశారు.