: భారత్ కు అనుకూలంగా స్పందించిన ట్రంప్.. పాక్ కు చురకలు

భారత్ కూడా ఉగ్రవాద బాధిత దేశమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ఆయన రియాద్ లోని అరబ్ ఇస్లామిక్-యూఎస్ సదస్సులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు  చేశారు. అమెరికా నుంచి భారత్ వరకు, ఆస్ట్రేలియా నుంచి రష్యా వరకు అన్ని దేశాలూ ఉగ్రవాద బాధితులేనని ఆయన అన్నారు. ఈ దేశాలన్నీ పలుసార్లు ఉగ్రదాడుల బారిన పడ్డాయని తెలిపారు. ఏ దేశం కూడా తమ భూభాగంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించకూడదని పరోక్షంగా పాకిస్థాన్ ను ఉద్దేశించి అన్నారు. 

More Telugu News