: కొంకణ్ రైల్వే ప్రయాణికులకు ఫ్రీ వై-ఫై సౌకర్యం!

మహారాష్ట్రలోని కొంకణ్ రైల్వే తమ ప్రయాణికుల కోసం ఉచిత వై-ఫై సౌకర్యాన్ని అందిస్తోంది. మొదటి దశలో భాగంగా కొలాద్- మాదూర్ స్టేషన్ల మధ్య సుమారు 28 స్టేషన్లకు అన్ లిమిటెడ్ ఫ్రీ వై-ఫై సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు సిస్కాన్, జోయిస్టర్ తో రైల్వే చేసుకున్న ఒప్పందం ప్రకారం ఉచిత వై-ఫై సౌకర్యాన్ని అందిస్తోంది. కాగా, కొంకణ్ రైల్వేలో ఉచిత వై-ఫై సౌకర్యాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు నిన్న ప్రారంభించారు.

More Telugu News