: అరుంధతి రాయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పరేష్ రావల్

ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ పై బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ పరేష్ రావల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందిస్తూ... కశ్మీర్ లో రాళ్లు విసిరే యువకులకు బదులుగా అరుంధతి రాయ్ ను ఆర్మీ జీప్ కు కట్టాలని ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో దుమారం చెలరేగింది. పరేష్ రావల్ వ్యాఖ్యలపై పలువురు ట్విట్టర్ వేదికగా మండిపడుతున్నారు. పోలీసులపై ముష్కరులు రాళ్లు రువ్వుతున్న నేపథ్యంలో, వారి రాళ్ల దాడి నుంచి తప్పించుకోవడానికి ఓ స్థానిక యువకుడిని ఆర్మీ జీపు ముందు కట్టి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. 

More Telugu News