: కర్నూలు జిల్లా బంద్.. బస్సు డిపోల ఎదుట వైసీపీ కార్యకర్తల ఆందోళన

పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్ చార్జి నారాయణరెడ్డి హత్యకు గురైన నేపథ్యంలో ఈ రోజు కర్నూలు జిల్లా బంద్ కు ఆ పార్టీ పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బస్ డిపోల ఎదుట వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బస్సులు బయటకు రాకుండా, పెట్రోల్ బంక్ లు, వ్యాపార, వాణిజ్య సంస్థలను తెరవనీయకుండా అడ్డుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ర్యాలీలు, ధర్నాలకు దిగాయి.   

More Telugu News