: రేపు గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను వైఎస్సార్సీపీ అధినేత జగన్ రేపు కలవనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ తో జగన్ భేటీ కానున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్ చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య నేపథ్యంలో ఆయన గవర్నర్ ను కలవనున్నట్టు తెలుస్తోంది. గవర్నర్ ను కలిసిన అనంతరం జగన్ కర్నూలు జిల్లాకు వెళతారు. నారాయణరెడ్డి అంత్యక్రియలలో ఆయన పాల్గొంటారు.

More Telugu News