: ఏపీ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ఐదు రోజుల పనిదినాల విధానం పొడిగింపు!

ఏపీ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లిన ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. సచివాలయ సంఘం వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్ పై సీఎం చంద్రబాబునాయుడు సంతకం చేశారు. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. తాజా నిర్ణయంతో, సచివాలయం, రాష్ట్ర స్థాయి కార్యాలయాలు 2018 జూన్ 27 వరకు వారానికి ఐదు రోజులే పని చేస్తాయి. 

More Telugu News