: మూడు కోట్ల సర్వీస్ ట్యాక్స్ ఎగ్గొట్టిన హోటల్ యజమాని అరెస్టు

భారీ మొత్తంలో సర్వీస్ ట్యాక్స్ ఎగ్గొట్టిన ఓ హోటల్ యజమానిని అరెస్టు చేశారు. విశాఖపట్టణంలోని హోటల్ మేఘాలయ ఎండీ సురేష్ ను సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, మూడు కోట్ల రూపాయల మేరకు సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదని, అందుకే, అరెస్టు చేశామని చెప్పారు. మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించినట్టు చెప్పారు. సురేష్ ను రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు.

More Telugu News